Sunday 6th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఫోన్ ట్యాపింగ్..షర్మిల వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి రియాక్షన్

ఫోన్ ట్యాపింగ్..షర్మిల వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి రియాక్షన్

YV Subba Reddy About Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆమె వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయాన్ని వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డే తనతో చెప్పారని, ఈ మేరకు ట్యాప్ అయిన ఒక ఫోన్ సంభాషణను సైతం వినిపించారని పేర్కొన్నారు.

కాగా షర్మిల చేసిన ఆరోపణలపై తాజగా వైవి సుబ్బారెడ్డి స్పందించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఆరోపణల్ని కొట్టిపారేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా,షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు.

అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌చేసిందా?లేదా? అన్నది తనకు తెలియదన్నారు. టీడీపీకి సంబంధించిన వాటిలో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions