Friday 8th May 2026
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

Telangana Employees Donate Rs. 100 Crore For Flood Relief | తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అతిభారీ వర్షాలు తీవ్ర విషాదం మిగిల్చాయి.

ఖమ్మం, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరదల కారణంగా జనజీవనం స్థంభించింది. ఎందరో బాధితులు నిరాశ్రయులయ్యారు.

వరదల కారణంగా రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ ( Cm Revanth ) ప్రధమిక అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు ( Telangana Govt. Employees ) ఉదార మనసును చాటుకున్నారు.

వరద బాధితులను ఆదుకునేందుకు వారు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనం సుమారు రూ.100 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ప్రకటించారు.

You may also like
farmer
మొంథా ఎఫెక్ట్: అన్నదాతల గుండెకోత!
భారీ వర్షాలు..ముఖ్యమంత్రి ఆదేశాలు
హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన
sandeep reddy vanga
సీఎం రిలీఫ్ ఫండ్ కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విరాళం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions