Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హై టెన్షన్..బాబ్రీ మసీద్ కు పునాది రాయి

హై టెన్షన్..బాబ్రీ మసీద్ కు పునాది రాయి

Suspended TMC MLA Humayun Kabir lays ‘Babri-style’ mosque foundation | ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 1992 డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన విషయం తెల్సిందే. అయితే ఈ ఘటన జరిగిన మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ బాబ్రీ మసీద్ కు పునాది రాయి పడింది. కానీ ఉత్తరప్రదేశ్ లో కాదు పశ్చిమ బెంగాల్ లో. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లోని బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ మసీద్ పేరుతో ఓ మసీదును నిర్మించనున్నట్లు బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఇటీవలే ప్రకటించారు.

ఈ మేరకు శనివారం పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మరికొంతమంది తమ తలపై పునాది రాళ్లను తీసుకుని వెళ్లారు. త్రినముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ బాబ్రీ మస్జీద్ ను నిర్మించబోతున్నట్లు చేసిన ప్రకటన జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

అయినప్పటికీ హుమాయున్ కబీర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రకటించిన విధంగానే శనివారం బాబ్రీ మసీద్ పేరుతో నిర్మించబోయే మసీదుకు శంకుస్థాపన చేశారు. ఈ మసీద్ కూడా బాబ్రీ మస్జీద్ ను పోలే విధంగా ఉంటుందని ఆ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇకపోతే ముర్షిదాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం అనే విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions