Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > రామచందర్ రావు ఏకగ్రీవం

రామచందర్ రావు ఏకగ్రీవం

N. Ramchander Rao to take charge as BJP State president | తెలంగాణ బీజేపీ పగ్గాలను చేపట్టారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు.

ఈ మేరకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే. అనంతరం రామచందర్ రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు కిషన్ రెడ్డి నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు నూతన అధ్యక్షున్ని సత్కరించారు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులందరూ రామచందర్ రావుతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions