Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నేతాజీ జయంతి.. నివాళి అర్పించిన ప్రధాని మోదీ!

నేతాజీ జయంతి.. నివాళి అర్పించిన ప్రధాని మోదీ!

modi pays tribute to nethaji subhash chandrabose

PM Modi Pays Tribute To Nethaji | భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) 129వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నివాళులు అర్పించారు.

ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఈ రోజును దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ చూపిన అజేయ ధైర్యం, అచంచల సంకల్పం, అసమాన సేవలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

ఆయన నిర్భయ నాయకత్వం బలమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి దారితీస్తోందన్నారు. గతంలో నేతాజీ వారసత్వాన్ని నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు ఆయన జీవితం, ఆదర్శాలను దేశానికి చేరువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడం, ఎర్రకోటలో జాతీయ పతాకం ఎగురవేయడం, అండమాన్‌లో ద్వీపాలకు పేర్లు మార్చడం, ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఆయనకు ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని మోదీ అన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions