Sunday 2nd August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > చైనా కోసం మన చినాబ్ వంతెనపై కన్నేసిన పాకిస్తాన్

చైనా కోసం మన చినాబ్ వంతెనపై కన్నేసిన పాకిస్తాన్

Pakistan Spying On Chenab Bridge | జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లోని రైసీ, రామబాన్ జిల్లాల మధ్య చినాబ్ ( Chenab )నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వేవంతెనపై పాకిస్తాన్ ( Pakistan ) కన్నేసినట్లు తెలుస్తోంది.

సుమారు 20 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. ఇప్పటికే ఈ బ్రిడ్జి పై తొలి రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ వంతెనకు సంబంధించిన వివరాలను చైనా కోరడంతోనే పాకిస్తాన్ దేశ ఇంటిలిజెన్స్ వర్గాలు రైల్వే బ్రిడ్జి గురించి అత్యంత కీలకమైన వివరాలను సేకరిస్తున్నట్టుకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

చినాబ్ రైల్వే వంతెన కంటే ముందువరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుభాయ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఉండేది. ఇదిలా ఉండగా చినాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి వివరాలను చైనా ఎందుకు సేకరించమని పాకిస్తాన్ ను పురమాయించిందో అనేది తెలియాల్సి ఉంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions