Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్..అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్..అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

KCR announces Maganti Sunitha as BRS candidate for Jubilee Hills by-poll | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా సేవలందించిన బీఆరెస్ నాయకులు మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అతి త్వరలోనే బై ఎలక్షన్స్ జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్ధిగా కేసీఆర్ ఎంపిక చేసినట్లు గులాబీ పార్టీ స్పష్టం చేసింది.

చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆరెస్ వెల్లడించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions