Saturday 30th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > కేసీఆర్ నిర్ణయాలపై తనయ కవిత సంచలన పోస్ట్

కేసీఆర్ నిర్ణయాలపై తనయ కవిత సంచలన పోస్ట్

Kalvakuntla Kavitha News | బీఆరెస్ పార్టీ కార్యక్రమాలను ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం కోసం నవంబర్ 29 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29న ‘దీక్ష దివస్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు బీఆరెస్ పిలుపునిచ్చింది.

అలాగే కేసీఆర్ దీక్ష విరమించిన రోజు డిసెంబర్ 9న ‘విజయ్ దివస్’ గా కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు, కార్యకర్తలకు బీఆరెస్ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఓ వైపు బీఆరెస్ శ్రేణులు విజయ్ దివస్ జరుపుకుంటున్న సమయంలో కవిత ఎక్స్ వేదికగా బాంబు పేల్చారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు. ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నరు’ అని కవిత కీలక పోస్ట్ చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions