Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’

‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’

India, Pakistan agree to ceasefire after long night of talks, says Trump | భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

భారతదేశం, పాకిస్థాన్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. సుదీర్ఘ చర్చలు, అమెరికా మధ్యవర్తిత్వం అనంతరం ఈ మేరకు భారత్-పాక్ అంగీకరించినట్లు తెలిపారు.

అలాగే కామన్ సెన్స్ ను వాడి కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్-పాక్ ను ట్రంప్ అభినందించారు. అలాగే అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా స్పందించారు.

గత 48 గంటలుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, తాను భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క సీనియర్ అధికారులతో మరియు ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆసిమ్ మునీర్, మరియు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ మరియు ఆసిమ్ మాలిక్‌లతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు మరియు తటస్థ ప్రదేశంలో విస్తృత అంశాలపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించినట్లు ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శాంతి మార్గాన్ని ఎంచుకున్నందుకు ప్రధానమంత్రులు మోదీ మరియు షరీఫ్‌లను అభినందించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions