Monday 17th March 2025
12:07:03 PM
Home > తాజా > ‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’

‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’

Harish Rao Satires On Congress | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు.

‘ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ..లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి’ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.

You may also like
‘యూట్యూబర్ హర్షసాయి నీకు బుద్ధి ఉందా’
‘ఏయ్ పోలీస్! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్’
‘హిందీ వివాదం..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన’
హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions