Saturday 2nd August 2025
12:07:03 PM
Home > తాజా > ‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’

‘కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది’

Harish Rao Satires On Congress | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు.

‘ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలింది. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించండి. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ..లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి’ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.

You may also like
పేరెంట్స్-టీచర్ మీటింగ్ కు హాజరైన మంత్రి లోకేశ్-బ్రాహ్మణి
ముఖ్యమంత్రి చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక
‘బనకచర్లపై పోరుకు సిద్ధం అవ్వండి’
‘బలగం’ పాటకు జాతీయ అవార్డు..’తెలంగాణకు గర్వ కారణం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions