Hardik Pandya Flaunts Ultra-Rare Richard Mille Watch – Worth Rs.20 Crore | హార్దిక్ పాండ్య ధరించిన అత్యంత ఖరీదైన వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వాచ్ ధర ఏకంగా ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధికంగా ఉండడం ఆసక్తిగా మారింది.
ఆసియా కప్-2025 కు సర్వం సిద్ధమయ్యింది. మంగళవారం నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బుధవారం టీం ఇండియా ఆతిథ్య యూఏఈ తో తలపడనుంది. కాగా భారత ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్య రూ.20 కోట్లు విలువ చేసే ఖరీదైన వాచ్ ను ధరించి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ వాచ్ లగ్జరీ బ్రాండ్ అయిన రిచర్డ్ మిల్లె కు చెందింది. హార్దిక్ ధరించిన రిచర్డ్ మిల్లె ఆర్ఎం 27-04 ధర రూ.20 కోట్లు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచీలు కేవలం 50 మాత్రమే ఉన్నాయి. టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నడాల్ సహకారంతో ఈ వాచ్ ను రూపొందించారు.
స్ట్రాప్ తో కలిపి ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములే ఉంటుంది. మరోవైపు ఆసియా కప్ 2025 ప్రైజ్ మనీ రూ.2.6 కోట్లు. అంటే ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధికంగా ఈ వాచ్ ధర ఉంది.
అలాగే ఆసియా కప్ కోసం పాకిస్థాన్ 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ ఆటగాళ్ల వార్షిక జీతం మొత్తం రూ.19 కోట్లు. అంటే హార్దిక్ ధరించిన వాచ్ ధర పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతం కంటే ఎక్కువ.










