Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్..!

పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్..!

Panjagutta Fire Accident| పంజాగుట్ట ( Panjagutta ) లోని ఒక అపార్ట్మెంట్ ( Apartment ) లో అగ్ని ప్రమాదం ( Fire Accident ) సంభవించగా వెంటనే స్పందించిన ట్రాఫిక్ ( Traffic ) కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించారు.

వివరాల్లోకి వెళ్తే పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ ( Short Circuit ) కారణంగా ఐదు, ఆరవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగడం తో ఆ అపార్ట్మెంట్ లో నివసించే వారు లోపాలనే ఇరుక్కుపోయారు.

అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ( Constable ) శ్రవణ్ కుమార్ ( Shravan Kumar ) హుటాహుటిన ఆరవ అంతస్తు చేరుకొని తలపులు బద్దలు కొట్టి, కుటుంబాన్ని రక్షించారు.

అలాగే దశరథ రాంరెడ్డి ( Dasaratha Ram Reddy ) మరియు సత్యనారాయణ ( Satyanarayana ) అనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అక్కడ నివసించే వారిని రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఏ హాని జరగలేదని తెలిపారు పోలీసులు. కాగా తమ ప్రాణాలకు తెగించి మాటల్లో చిక్కుకున్న వారిని రక్షించిన కానిస్టేబుల్స్ ను అందరూ అభినందిస్తున్నారు.

You may also like
blood donation by kbk group
KBK Group ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం!
పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!
rushikonda builing
రుషికొండ భవనం పై TDP vs YCP!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions