Wednesday 13th May 2026
12:07:03 PM
Home > తాజా > గంజాయి ముఠాతో పోరాడి..’నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ’

గంజాయి ముఠాతో పోరాడి..’నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ’

Excise constable Gajula Sowmya passes away | అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాతో వీరోచితంగా పోరాడిన మహిళా కానిస్టేబుల్ సౌమ్య నిన్స్ ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 23న నిజామాబాద్ లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అయితే గంజాయి ముఠా సౌమ్యను వహనంతో ఢీ కొట్టి అత్యంత దారుణంగా దాడి చేసింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ స్పందించారు. మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం సౌమ్యది అని పేర్కొన్నారు. రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన ‘త్యాగం’ ఆమె సొంతం అన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యానికి సెల్యూట్ తల్లీ అంటూ సౌమ్యకు నివాళులర్పించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సౌమ్య ధైర్యానికి మరణం లేదన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions