Friday 1st May 2026
12:07:03 PM
Home > సినిమా > రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!

రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!

Ram Charan

Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నరు. ఈ మేరకు తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

సింగపూర్ లోని మ్యూజియంలో రామ్ చరణ్ తోపాటు ఆయన పెంపుడు కుక్క రైమీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహ తయారీకి సంబంధించి ఫొటో షూట్ కూడా ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేశారు. టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. మేడమ్ టుస్సాడ్స్ లో ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions