Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ పని అయిపోయింది.. ఇక నుండి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే..ఎంపీ!|

బీఆరెస్ పని అయిపోయింది.. ఇక నుండి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే..ఎంపీ!|

Dharmapuri Arvind News| నిజామాబాద్ ( Nizamabad ) ఎంపీ, బీజేపీ ( BJP ) నేత ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind )ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం నాడు మీడియా ( Media )తో మాట్లాడారు ఆయన.

అసెంబ్లీ ( Assembly ) ఎన్నికల్లో బీఆరెస్ ఓటమితో ఆ పార్టీ శకం ముగిసిందని, ఇక నుండి కాంగ్రెస్ ( Congress ) మరియు బీజేపీ ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అభిప్రాయ పడ్డారు. బీఆరెస్ ( BRS ) పతనం మొదలైందని, అందుకు తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు ఈ బీజేపీ నేత.

అలాగే బీఆరెస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, అంతేకాకుండా లిక్కర్ కేసు ( Liquor Case )లో కవిత ఎపిసోడ్ కూడా కాంగ్రెస్ కు దోహద పడిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హుందాతనంతో కూడిన రాజకీయాలు తిరిగి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేతల బాషా కూడా మారుతుందన్నారు.

బలమైన అభ్యర్థి లేని చోట తాను వెళ్లి పోటీ చేసానని, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా పోటీ చేసానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చాలా కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి అంటూ కితాబిచ్చారు.

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions