Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది’

‘వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది’

CM Revanth Reddy Visits Kamareddy | ఇటీవలి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని నష్టపోయిన వారిని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడి అందర్నీ కాపాడిందని పేర్కొన్నారు.

మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, పశుసంపద కోల్పోయిన వారికి సాయం అందించాలని ఆదేశించారు. కాగా కామారెడ్డి చేరుకునే సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా జిల్లాలో నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions