Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!

సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!

ap cm

CM Chandrababu Visits Polavaram | సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇదే తొలి పర్యటన కావడం విశేషం.

ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం, పోలవరం ప్రోజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions