RS Praveen Kumar | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది.
ఆదివారం రాత్రి కాగజ్ నగర్ పట్టణంలోని విజయబస్తీ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది బీఎస్పి. అదే సమయంలో భారీ శబ్దాలతో బీఆరెస్ ప్రచార వాహనం అక్కడికి వచ్చింది.
దీంతో బీఎస్పి మరియు బీఆరెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
సభ జరుగుతున్న సమయంలో సౌండ్ తగ్గించాలని బీఆరెస్ వారిని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆరేస్ ప్రవీణ్ కుమార్.
బీఆరెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఆరేస్ ప్రవీణ్ కుమార్.
ఈ నేపథ్యంలో ఆదివారం కాగజ్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సిర్పూర్ నుండి బీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తో బీఎస్పి నుండి తలపడుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.