Wednesday 15th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కొండగట్టులో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన

కొండగట్టులో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన

AP Deputy CM Pawan Kalyan to Visit Kondagattu temple | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించనున్నారు. కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రూ.35.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కొండగట్టుకు వచ్చారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం గదులు, ధర్మశాల, మాల విరమణ మండపం కోసం సహకరించాలని ఆలయ అర్చకులు కోరారు.

దింతో తాజగా పవన్ సిఫారసు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొండగట్టు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసింది. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు పవన్ కొండగట్టు రానున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో నిర్మించ తలపెట్టిన గదుల నిర్మాణ స్థలానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు, జనసైనికులతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions