Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వైజాగ్ లో గూగుల్..తమిళనాట రాజకీయ రగడ

వైజాగ్ లో గూగుల్..తమిళనాట రాజకీయ రగడ

AIADMK Slams CM Stalin As Google Goes To Andhra | దిగ్గజ టెక్ సంస్థ ఏపీలోని విశాఖపట్నంలో రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ తో పాటుగా వైజాగ్ ను ఏఐ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

విశాఖలో గూగుల్ పెట్టుబడి తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక తమిళ వ్యక్తి, అయినప్పటికీ గూగుల్ ను తమిళనాడుకు తీసుకురావడంలో అధికారంలోని డీఎంకే విఫలం అయ్యిందని ఏఐడీఎంకే విమర్శలు గుప్పించింది. సుందర్ పిచాయ్ మదురైలో పుట్టి పెరిగారని, అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా భారీ పెట్టుబడి విశాఖకు తరలిపోయిందని అన్నా డీఎంకే నాయకులు ఆర్బీ ఉదయకుమార్ మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే గూగుల్ తమిళనాడుకే వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి, డీఎంకే నేత స్పందించారు. గూగుల్ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదనే విమర్శల్లో అర్ధం లేదన్నారు. అలాగే ఫాక్స్ కాన్ త్వరలోనే రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions