YS Jagan Phone Call To Ambati Rambabu | గుంటూరులో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు అంబటి నివాసం, కార్యాలయం ముందు పలు సందర్భాల్లో ఆందోళనకు దిగడం ఆ తర్వాత పోలీసులు అంబటిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అరెస్ట్ కంటే ముందు అంబటికి ఫోన్ చేశారు జగన్. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఏపీ జంగిల్ రాజ్ గా మారిపోయిందన్నారు. బాబు దుర్మార్గాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే అంబటిపై హత్యాయత్నం, దాడులకు దిగారని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకుల్లా మారిపోయారని విమర్శించారు.









