Wednesday 11th February 2026
12:07:03 PM
Home > తాజా > గంజాయి ముఠాతో పోరాడి..’నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ’

గంజాయి ముఠాతో పోరాడి..’నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ’

Excise constable Gajula Sowmya passes away | అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాతో వీరోచితంగా పోరాడిన మహిళా కానిస్టేబుల్ సౌమ్య నిన్స్ ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 23న నిజామాబాద్ లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అయితే గంజాయి ముఠా సౌమ్యను వహనంతో ఢీ కొట్టి అత్యంత దారుణంగా దాడి చేసింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ స్పందించారు. మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం సౌమ్యది అని పేర్కొన్నారు. రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన ‘త్యాగం’ ఆమె సొంతం అన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యానికి సెల్యూట్ తల్లీ అంటూ సౌమ్యకు నివాళులర్పించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సౌమ్య ధైర్యానికి మరణం లేదన్నారు.

You may also like
konda sushmitha book rudra
మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!
ts govt logo
వాహనదారులకు భారీ ఊరట.. ఆ పన్ను నుంచి మినహాయింపు?
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!
lavanya tripathi
‘చిరంజీవి గారి గురించి మీకేం తెలుసు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions