Sharad Pawar On Plane Crash | మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Deputy CM Ajith Pawar) బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై కొంతమంది రాజకీయ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నాయకుడు, అజిత్ పవార్ బాబాయ్ శరద్ పవార్ (Sharadh Pawar) ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అజిత్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఈ ఘటన ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.
“అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్రకు తీరని నష్టం వాటిల్లింది. ఒక సమర్థుడైన నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయాం. ఈ లోటు ఎప్పటికీ పూడ్చలేనిది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ మన చేతుల్లో ఉండవనీ, కొన్ని సంఘటనల వెనుక ఎలాంటి రాజకీయం ఉండదని వ్యాఖ్యానించారు. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దనీ విజ్ఞప్తి చేశారు.










