Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానానికి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ నేపత్యంలో తన 47 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… కృతజ్ఞతలతో మీ చిరంజీవి అని రాసుకొచ్చారు మెగాస్టార్. ఈ ట్వీట్ ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.










