Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం’

‘సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం’

Revanth Reddy Had Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka | తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామ నవమి నేపథ్యంలో సీఎం కుటుంబ సమేతంగా భద్రాచలంకు వెళ్లారు.

సీతారాముల కళ్యాణంలో స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో సీఎం మరియు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ముఖ్యమంత్రి మరియు మంత్రులు భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మరియు మంత్రులు తమ ఇంటికి రావడం పట్ల శ్రీనివాస్ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions