Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 1200 కి.మీ.పరుగుతీసి..అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆరేళ్ళ బాలుడు

1200 కి.మీ.పరుగుతీసి..అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆరేళ్ళ బాలుడు

6 Year Old Boy Runs 1200 Km From Punjab To Ayodhya | అయోధ్య ( Ayodhya ) రామమందిర వార్షికోత్సవాన్ని హిందు క్యాలెండర్ ప్రకారం శనివారం నిర్వహించారు.

ఈ క్రమంలో ఓ ఆరేళ్ళ బాలుడు బాల రాముడిని దర్శించుకునేందుకు పంజాబ్ నుండి ఏకంగా 1200 కి.మీ. పరుగుతీసి అయోధ్యకు చేరుకున్నాడు. శనివారం బాలుడ్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Cm Yogi Adityanath ) సన్మానించారు.

పంజాబ్ ఫజిల్కా ( Fazilka ) జిల్లా అబోహార్ ( Abohar ) కు చెందిన మోహబ్బత్ ( Mohabbat ) కు ఆరేళ్ళ వయస్సు. అతనికి రామ భగవానుడు అంటే ప్రాణం. ఈ క్రమంలో అయోధ్య రామాలయ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ బార్డర్ వద్ద ఉండే తన గ్రామం నుండి పరుగు మొదలెట్టాడు.

నవంబర్ 14న తన పరుగును మొదలుపెట్టిన బాలుడు రోజుకు సుమారు 19-20 కి.మీ. ప్రయానించేవాడు. ఇలా సుమారు రెండు నెలలు పరుగుతీసి శుక్రవారం అయోధ్యకు చేరుకున్నాడు.

అనంతరం రాముడిని దర్శించుకుని తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగి బాలుడ్ని అభినందించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions