Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > డబ్ల్యూపీఎల్ లో UNSOLD..వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ

డబ్ల్యూపీఎల్ లో UNSOLD..వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ

Ira Jadhav Makes History with a Stunning 346 in U19 Women’s Match | ప్రపంచ వన్డే ( ODI ) చరిత్రలో ఓ యువ మహిళ క్రికెటర్ చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్ లో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించింది.

అయితే ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ ( WPL ) ఆక్షన్ ( Auction ) లో ఆమెను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అండర్-19 స్థాయిలో జరిగిన మ్యాచులో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరా జాదవ్ ( Ira Jadhav ) మేఘాలయ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించింది.

కేవలం 157 బంతుల్లోనే 346 పరుగులు చేసింది. ఇందులో 42 ఫోర్లు, 16 సిక్సులు ఉన్నాయి. ఇరా జాదవ్ తో పాటు కెప్టెన్ హుర్లే గాలా కూడా సెంచరీ చేయడంతో 50 ఓవర్లలో ముంబై జట్టు 563 రన్స్ చేసింది.

భారీ లక్ష్య చేదనకు దిగిన మేఘాలయ కేవలం 19 పరుగులకే కుప్పకూలింది. ఇదిలా ఉండగా ఇరా జాదవ్ ఇన్నింగ్స్ ను అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్ అద్భుతంగా ఉండబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions