Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నిరాహార దీక్ష..వేదిక పక్కనే లగ్జరీ వ్యాన్

నిరాహార దీక్ష..వేదిక పక్కనే లగ్జరీ వ్యాన్

Prashant Kishore Latest News | బీహార్ ( Bihar )లో జన్ సురాజ్ పార్టీ ( Jan Suraaj Party )ని స్థాపించి జనాల్లోకి వెళ్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజగా విమర్శల పాలవుతున్నారు.

ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ ( Preliminary ) పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పరీక్ష అభ్యర్థులు సైతం రోడ్డెక్కారు. ఈ క్రమంలో పరీక్షను రద్దు చేసి, కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

పట్నాలోని గాంధీ మైదాన్ ( Gandhi Maidan ) లో మహాత్ముడి విగ్రహం ముందు ఆయన నిరశన చేస్తున్నారు. అయితే వేదిక పక్కనే ఓ లగ్జరీ వ్యాన్ దర్శనమిచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ కు చెందిందే. అందులో ఏసీ, కిచెన్ ( Kitchen ), బెడ్రూం ( Bedroom ) వంటి సదుపాయాలు ఉన్నాయి.

దీనిపై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో లగ్జరీ వ్యాన్ ( Luxury Van ) పై కాదు, పట్టించుకోవాల్సింది విద్యార్థుల భవిష్యత్ గురించి అంటూ జన్ సురాజ్ పార్టీ ప్రతినిధులు స్పందిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions