Chiranjeevi Meets Cm Chandrababu | తెలుగురాష్ట్రాల వరద బాధితుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) భారీ విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.
ఇందులో భాగంగా శనివారం దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ ( Hyderabad ) లోని సీఎం చంద్రబాబు ( Cm Chandrababu )నివాసానికి వెళ్లారు చిరంజీవి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan ) తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం చంద్రబాబు చిరంజీవికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ ( X )వేదికగా పోస్ట్ చేశారు.
మానవసేవలో చిరంజీవి ఎప్పూడూ ముందుంటారు అని కొనియాడారు. రూ.కోటి విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్పారు.
సీఎం చంద్రబాబు పోస్ట్ పై తాజాగా చిరంజీవి స్పందించారు. మన ప్రజలకు విపత్తు ఎదురైనప్పుడు సహాయం అందించడం మన బాధ్యత అని చిరంజీవి గుర్తుచేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయక చర్యలు ఆదర్శం అని మెగాస్టార్ పేర్కొన్నారు.