Wednesday 30th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > లడ్డూ వివాదం..శాస్త్రాలతో పాటు అస్త్రాలను తీసుకెళ్లాలి

లడ్డూ వివాదం..శాస్త్రాలతో పాటు అస్త్రాలను తీసుకెళ్లాలి

Actor Ravi Kishan On Tirumala Laddu | తిరుమల శ్రీవారి లడ్డూలో జంతుకొవ్వును వినియోగించారన్న అంశం తీవ్ర వివాదంగా మారింది. ఈ వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ ( Ravi Kishan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల లడ్డూలో జంతు మాంసాన్ని కలిపి ఇచ్చారని కన్నెర్ర చేశారు.

ఈ మేరకు మంగళవారం గోరఖ్‌పూర్‌ ( Gorakhpur )లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్థంతి వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రస్తుత ఆలయాన్ని గతంలో నడిపిన వారు హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు.

శాస్త్రాలతో పాటు అస్త్రాలను, ఆయుధాలను తీసుకెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సాధువులు, యోధులుగా మరాల్సిన పరిస్థితి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions