Saturday 9th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు.. మందకృష్ణ మాదిగ హర్షం |

వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు.. మందకృష్ణ మాదిగ హర్షం |

Mandakrishna Madiga News | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ( Reservations ) ఉప వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ ( MRPS ) వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.

30 ఏళ్ల తమ పోరాటం ఫలించిందని చెప్పారు. తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు MRPS సుదీర్ఘ పోరాటం చేసిందని, ఈ క్రమంలో ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఉపవర్గీకరణ ( Sub-Classification ) అధికారం ఉందని సుప్రీం తీర్పును ఆయన స్వాగతించారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్గీకరణ విజయాన్ని ప్రాణాలర్పించిన MRPS నేతలకు అంకితం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొదట వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబే ( Cm Chandrababu )నని మందకృష్ణ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అలాగే వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని మందకృష్ణ కోరారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions