Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > టీచర్ పోస్ట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్!

టీచర్ పోస్ట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్!

Telangana TET Notification 2024 | తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ ( Notiication )ను విడుదల చేసింది.

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నిర్వహిస్తామని అభ్యర్థులకు మాట ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఏడాదిలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఈ టెట్ పరీక్షలు జనవరిలో జరగనున్నాయి.

2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ( Online )లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరు కాగా, 1.09 లక్షల మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో, వేలాది మంది సర్వీసులు ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions