Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

telangana common entrance tests

TG Govt Says Good News | నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 17.651 శాతం కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. జూలై 1, 2025 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీనివల్ల తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యుత్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి చేసే సమీక్షలో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions