Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

telangana common entrance tests

TG Govt Says Good News | నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 17.651 శాతం కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. జూలై 1, 2025 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీనివల్ల తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యుత్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి చేసే సమీక్షలో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

You may also like
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!
vc sajjanar
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions