Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > మేడారం మహా జాతరకు రండి..కేసీఆర్ కు ప్రభుత్వ ఆహ్వానం

మేడారం మహా జాతరకు రండి..కేసీఆర్ కు ప్రభుత్వ ఆహ్వానం

Ministers Seethakka and Konda Surekha Meet’s KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ను మేడారం మహా జాతరకు అధికారికంగా ఆహ్వానం పలికింది రాష్ట్ర ప్రభుత్వం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఈ సందర్భంగా మహిళా మంత్రులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను మంత్రులు ఆహ్వానించారు.

సమ్మక్క-సారాలమ్మ బంగారాన్ని, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావలసిందిగా ఆహ్వానించారు. ఆహ్వానాన్ని కెసిఆర్ స్వీకరించారు. మేడారం జాతరకు వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా అతిథి మర్యాదలతో మహిళా మంత్రులకు పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో కేసీఆర్ దంపతులు సత్కరించారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు సమ్మక్క-సారాలమ్మ మహా జాతర జరగనున్న విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions