Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

Minister Jaishankar In Pakistan | పాకిస్తాన్ దేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మార్నింగ్ వాక్ ( Morning Walk ) చేశారు.

షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జై శంకర్ మంగళవారం పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పాక్ లోని భారత హైకమీషన్ లో ఉన్న సిబ్బందితో కేంద్రమంత్రి మార్నింగ్ వాక్ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేసి, పాక్ లో టీం ఇండియా ( Team India )తో మార్నింగ్ వాక్ అని కాప్షన్ ( Caption ) ఇచ్చారు. అలాగే అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటండి అని ప్రధాని మోదీ ( Pm Modi )పిలుపు మేరకు కేంద్రమంత్రి జై శంకర్ పాక్ లో అర్జున మొక్కను నాటారు.

ఇదిలా ఉండగా మంగళవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్ ( Islamabad ) చేరుకున్న కేంద్రమంత్రికి ఆ దేశ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎస్ఓసి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్యదేశాలు ప్రతినిధులకు ఆ దేశ ప్రధాని షేహ్ బాజ్ షరీఫ్ మంగళవారం రాత్రి విందు ఇచ్చారు.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions