Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > GST 2.0..ఐపీఎల్ టికెట్లు మరింత ఫిరం !

GST 2.0..ఐపీఎల్ టికెట్లు మరింత ఫిరం !

IPL tickets get costlier with 40% GST | ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో 5, 18% శాతం స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి.

12, 28% స్లాబులను కేంద్రం తొలగించనుంది. అలాగే లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీ వర్తించనుంది. దింతో రేసు క్లబ్బులు, లీజింగ్, రెంటల్, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమ్స్, లాటరీ, క్యాసినో వంటివాటిపై 40 శాతం పన్ను పడనుంది.

ప్రీమియం క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ టికెట్ ధరలు సైతం ఈ జాబితాలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచుల టికెట్ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచుల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

నూతన స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దింతో వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ లీగ్ లో మ్యాచుల టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. రూ.1000 టికెట్ పై ఇప్పటివరకు 28 శాతం జీఎస్టీ వర్తించేది. అంటే రూ.1280 లకు టికెట్ లభించేది. ఇకనుండి రూ.1000 టికెట్ పై 40 శాతం జీఎస్టీ పడడంతో టికెట్ ధర రూ.1400 కు చేరుకోనుంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions