Tuesday 11th August 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..సికింద్రాబాద్ లో టెన్సన్ టెన్షన్

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..సికింద్రాబాద్ లో టెన్సన్ టెన్షన్

Idol Vandalised At Mutyalamma Temple In Monda Market | సికింద్రాబాద్ ( Secunderabad ) లోని ముత్యాలమ్మ ఆలయం ( Mutyalamma Temple )లో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

సోమవారం తెల్లవారుజామున మొండా మార్కెట్ ( Monda Market ) కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

ముగ్గురు దుండగుల్లో ఒకర్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం వద్దకు భారీగా చేరుకుంటున్నాయి.

నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ),రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav )ఆలయం వద్దకు చేరుకున్నారు.

హిందు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మత కలహాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఆలయ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions