Tuesday 14th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘పండుగలు వస్తే చాలు..దండుకోవడమేనా?’

‘పండుగలు వస్తే చాలు..దండుకోవడమేనా?’

Harish Rao Fires On Telangana Govt. | పండుగలు వస్తే చాలు దండుకోవడమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు హరీష్ రావు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటుని ధ్వజమెత్తారు.

పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

దింతో ప్రజలకు పండుగ సంబురం లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అని నిలదీశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
tgsrtc
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..ప్రభుత్వం క్లారిటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions