Monday 17th November 2025
12:07:03 PM
Home > తాజా > ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

cm revanth reddy

CM Revanth Tweet | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ద్వారా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).

“సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు” అంటూ బాలికలు ఆధార్ కార్డులను చూపిస్తున్న ఫోటోలను ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు.

You may also like
land
రూ. 10 వేలకే 2 ఎకరాలభూమి.. తెలంగాణలోనే!
bus fire in saudi
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!
kavitha kalvakuntla
‘బీఆరెస్ అందుకే ఓడింది..’ కవిత కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions