Friday 24th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

cm revanth reddy

Cm Revanth Reddy News | రాష్ట్రంలోని రైతులకు కావాల్సినంత యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అలాగే సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డుల విలువ పెరిగిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions