Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > అల్లు-వంగా మూవీ..కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిర్మాత!

అల్లు-వంగా మూవీ..కిక్కిచ్చే న్యూస్ చెప్పిన నిర్మాత!

Allu Arjun-Sandeep Reddy Vanga Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ధృవీకరించారు బాలీవుడ్ స్టార్ నిర్మాత, టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్. బార్డర్-2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అల్లు-వంగా మూవీపై అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో గతంలోనే ఓ సినిమా ఖరారు అయ్యింది. కానీ ఇద్దరూ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో అది ఆలస్యం అయ్యింది. మరోవైపు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో స్పందించిన భూషణ్ కుమార్ టీ సిరీస్ బ్యానర్ పై వరుసగా మూడు సినిమాలు చేయనున్నట్లు చెప్పారు.

రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’, ఆ తర్వాత యానిమాల్ సీక్వెల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండూ సినిమాల తర్వాత అల్లు అర్జున్-సందీప్ వంగా సినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చారు. దింతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే అల్లు అర్జున్ కు సందీప్ ఓ కథను చెప్పారు. కానీ వివిధ కారణాల మూలంగా అది ప్రారంభం కాలేదు. ‘అర్జున్ రెడ్డి’ లో అల్లు అర్జున్ ను అనుకున్నా అదీ వీలుపడలేదు. ఇకపోతే ప్రస్తుతం దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజన్ తో అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions