Thursday 13th August 2026
12:07:03 PM
Home > తాజా > రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు..ప్రకటించిన అల్లు అరవింద్

రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు..ప్రకటించిన అల్లు అరవింద్

Allu Aravind Announce Rs. 2 Crore Aid To Sritej | సంధ్య థియేటర్ ( Sandhya Theater ) తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో బుధవారం నిర్మాతలు అల్లు అరవింద్ ( Allu Aravind ), దిల్ రాజ్ ( Dil Raju ) శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతుందని, త్వరగానే కోలుకుంతున్నాడని తెలిపారు. అనంతరం రేవతి కుటుంబానికి రూ. కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇందులో నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) రూ. కోటి, దర్శకుడు సుకుమార్ ( Sukumar ) రూ.50 లక్షలు, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి రూ.50 లక్షలు ఇలా మొత్తం కలిపి రూ. రెండు కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రూ. రెండు కోట్ల చెక్కును దిల్ రాజుకు అందించారు.

అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ..గురువారం ఉదయం 10 గంటలకు సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions