- శ్రీవారి ఆలయం ఎదుట ప్రత్యేక పూజలు
Truck Donated To TTD | తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ లోకనాథ రెడ్డి రూ.15.24 లక్షల విలువైన నూతన ఎస్.ఎం.ఎల్. మహీంద్రా ట్రక్కును విరాళంగా అందజేశారు. టీటీడీ రవాణా అవసరాల నిమిత్తం ఆయన ఈ వాహనాన్ని స్వామివారికి సమర్పించారు.
ఆలయ డిప్యూటీ ఈఓకు తాళాలు అందజేత:
మంగళవారం శ్రీవారి ఆలయం ఎదురుగా నూతన వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి వాహన తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అధికారికంగా అందజేశారు.
తిరుమలలో స్వామివారి నిత్య అవసరాలు మరియు రవాణా సేవలకు ఈ ట్రక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.










