Harish Rao Fires On CM Revanth Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఆరెస్ నేత హరీష్ రావు స్పందించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతోనే ఇలా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే ఇటీవల తనకు, నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని హరీష్ పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. కానీ ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు.










