Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం..అందుకే కేటీఆర్ కు నోటీసులు’

‘రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం..అందుకే కేటీఆర్ కు నోటీసులు’

Harish Rao Fires On CM Revanth Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఆరెస్ నేత హరీష్ రావు స్పందించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతోనే ఇలా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే ఇటీవల తనకు, నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని హరీష్ పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. కానీ ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions