- డ్రైనేజీలో వరి ధ్యాన్యం.. వరదలో ఆవులు
- గుండెలు అవిసేలా రోదించిన రైతులు!
Montha Effect | మొంథా తుపాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక జిల్లాల్లో పట్టణాలను, గ్రామాలను వర్షం ముంచెత్తింది. ఈ తుపాన్ తో రెండు రాష్ట్రాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వరి పంట చేతిక వచ్చి మార్కెట్ చేరిన ధాన్యం తడిపోయి అన్నదాతలను ముంచేసింది.
ఈ క్రమంలో తెలంగాణలోని హుస్నాబాద్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ఓ రైతు ధాన్యం డ్రైనేజిలో వరదకు కొట్టుకుపోయింది. దీంతో డ్రైనేజీలో మిగిలిపోయిన తడినస ధాన్యాన్ని ఎత్తుతూ ఓ మహిళా రైతు బోరున విలపించింది. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాచుకున్న పంట ఇలా వర్షార్పణం కావడంతో ఆ రైతు గుండెలు అవిసేలా రొదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఓ వైపు నీటిని నుంచి ధాన్యాన్ని ఎత్తుతూ మరోవైపు అక్కడికి వచ్చిన కలెక్టర్ ను కాళ్లు మొక్కుతూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. మరోచోట నాగర్ కర్నూల్ జిల్లాలోని దేవరబండ అనే గ్రామంలో అకాల వర్షానికి పంట మునిగిపోయి, పాడి ఆవులు కొట్టుకుపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు.
నాలుగు పాడి ఆవులతోపాటు రెండున్నర ఎకరాల వరి పంట, 20 క్వింటాళ్ల పత్తి, పైపులు కూడా వరదలో కొట్టుకుపోవడంతో రైతు గుండెలవిసేలా రోదించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదాతలకు సాయం చేసి ఆదుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాలను కోరుతున్నారు.










