Monday 10th August 2026
12:07:03 PM
Home > తాజా > తెలగాణ తేజం ‘కొమురం భీం’ను కీర్తించిన ప్రధాని

తెలగాణ తేజం ‘కొమురం భీం’ను కీర్తించిన ప్రధాని

PM Modi remembers Telangana revolutionary Komaram Bheem in ‘Mann Ki Baat’ | తెలంగాణ వీర యోధుడు కొమురం భీంను కీర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కొమురం భీం గురించి మాట్లాడుతూ.. ’20వ శతాబ్దం ప్రారంభం, ఆ కాలంలో స్వాతంత్ర్యం సాధిస్తామనే ఆశ ఎక్కడా కనిపించలేదు. బ్రిటిష్‌ వారి దోపిడీకి హద్దు లేకుండా పోయింది. ఆ కాలంలో హైదరాబాద్‌లోని ప్రజలపై అణచివేత మరింత భయానకంగా ఉండేది. ప్రజలు క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను కూడా భరించవలసి వచ్చింది. పేదలు, గిరిజన సమాజాలపై జరిగే దురాగతాలకు హద్దులు లేవు. అలాంటి కష్టకాలంలో సుమారు 20 ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు నిజాం అధికారిని చంపేశారు. అంతేకాదు అరెస్టు నుంచి తప్పించుకోవడంలో కూడా విజయవంతమయ్యారు. నేను మాట్లాడుతున్నది కొమరం భీమ్ గురించి. అక్టోబర్ 22న ఆయన జయంతిని జరుపుకున్నాం. కొమురం భీం ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో చెరగని ముద్ర వేశారు” అని ప్రధాని పేర్కొన్నారు. విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడి గురించి యువత వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలని కోరారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions