Gold ornaments worth Rs 3.86 crore donated to Tirumala temple | తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందజేశారు విశాఖకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు శ్రీవారికి రూ.3.86 కోట్లు విలువైన వజ్రాల స్వర్ణ యజ్ఞోపవీతంను కానుకగా అందజేశారు.
ఇది మూడు కేజీల 860 గ్రాముల బరువు ఉంటుంది. రంగనాయకుల మండపంలో ఈ కానుకను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వీకరించారు. దాతలను అభినందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










