Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

Dasara Holidays In AP | దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి.

అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖను రాశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించి సెలవులపై గుడ్ న్యూస్ చెప్పారు.

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions