Saturday 30th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

ఎమ్మెల్సీల లేఖ..దసరా సెలవులపై మంత్రి గుడ్ న్యూస్

Dasara Holidays In AP | దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి.

అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖను రాశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించి సెలవులపై గుడ్ న్యూస్ చెప్పారు.

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions