Sunday 22nd March 2026
12:07:03 PM
Home > తాజా > ‘లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా’

‘లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా’

Congress MLA Bathula Laxma Reddy in Telangana donates Rs 2 crore for farmer’s | మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసి ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఈ మేరకు బత్తుల లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల చెక్కును సీఎంకు అందజేసి, ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్యే కుమారుడి సాయి ప్రసన్న వివాహం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని డబ్బులను రైతుల కోసం కేటాయించిట్లు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను అభినందించారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions