Friday 6th March 2026
12:07:03 PM
Home > తాజా > రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా

HYDRAA News Latest | రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లిలో సర్వే నంబరు 276లో 1.20 ఎకరాల భూమిని బుధవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది.

దీని విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఆల్విన్ కాలనీకి ఆనుకుని ఉన్న 276 సర్వే నంబరులో 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయని హైడ్రా పేర్కొంది. ఇంకా మిగిలి ఉన్న 1.20 ఎకరాల భూమి కబ్జా కాకుండా కాపాడినట్లు తెలిపింది.

అనంతరం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె వేశారు. అయితే ఈ భూమి తమదంటూ హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ పోరాడుతోంది. ఇదే సమయంలో ఆల్విన్ కాలనీ సంక్షేమ సంఘంతో పాటు ఆ పక్కనే ఉన్న కాకతీయనగర్ కాలనీ వాసులు మాత్రం ఈ భూమిని కాపాడి.. పార్కును నిర్మించాలనిలని హైడ్రాను కోరుతున్నారు.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions